News

వైసీపీ తప్పుదోవ పట్టిస్తోంది


మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రం ప్రకటనను చంద్రబాబు స్వాగతించారంటూ జగన్‌ తప్పుడు ప్రకటన చేస్తున్నారని మండిపడ్డారు. సభలో మాట్లాడుతూ నిన్న కేంద్రం చేసిన ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వ స్పందనను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. నిన్నటి ప్రకటన కోసం ప్రజలంతా ఆశగా ఎదురుచూశారని, లాభనష్టాలను అసెంబ్లీలో చర్చించాల్సి ఉందని చెప్పారు. ఈ అంశాన్ని వైసీపీ తప్పుదోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు.